Tirupati: రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు

by Disha Web Desk 16 |
Tirupati: రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు
X

దిశ, తిరుపతి: ఏప్రిల్ నెల వచ్చింది మొదలు ఉష్ణోగ్రతలు పెరిగాయి. అసాధారణంగా పెరుగుతున్న ఎండలు ఏపీతో పాటు చిత్తూరు జిల్లా వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో మందుబాబుల చూపు బీర్లపై పడింది. ఫలితంగా ఈ నెలలో బీర్ల అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఈ నెల 1 నుంచి 17 వరకు ఉమ్మడి జిల్లాలో ఏకంగా రూ. 32 లక్షల విలువైన బీర్లు అమ్ముడైనట్టు ఆబ్కారీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని తిరుపతిలో అత్యధికంగా 16 బార్లు ఉన్నాయి. ఈ బార్లలో బీర్లు తాగుతూ మందుబాబులు పండగ చేసుకుంటున్నారు.

ఎక్సైజ్ శాఖ గణాంకాల ప్రకారం

‘ఈ రెండు జిల్లాల్లో కలిపి ఈ నెల 17 వరకు మొత్తం రూ. 32 లక్షల బీర్లు అమ్మడుపోయాయి. అలాగే ఈ ఏడాది జనవరి నుంచి తిరుపతి జిల్లాలో సగటున 10 శాతం చొప్పున విక్రయాలు పెరిగాయి. తిరుపతి, చిత్తూరు జిల్ల కేంద్రాల్లో బీర్లు రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయి. నెలకు సగటున లక్ష న్నారు బీరు కేసులు అదనంగా అమ్ముడవుతున్నాయి.’ అని గణాంకాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి: Hailstorms: ఏపీకి హెచ్చరిక.. 125 మండలాల్లో వడగాల్పులు

Next Story

Most Viewed