శ్రీ వెంకటేశ్వర స్వామి అభిషేక సేవలో పలువురు రాజకీయ ప్రముఖులు

by Disha Web Desk 18 |
శ్రీ వెంకటేశ్వర స్వామి అభిషేక సేవలో పలువురు రాజకీయ ప్రముఖులు
X

దిశ,తిరుమల: తిరుమలలో శుక్రవారం వేకువ జామున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభిషేక సేవలో పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. వీరిలో రాష్ట్ర సమాచార శాఖ మాజీ మంత్రి చెల్లి బోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్, ప్రభుత్వ చిప్ విప్ ప్రసాద్ రాజులు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి అభిషేక సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ రంగనాయక మండపంలో ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అద్దాల మండపం వద్ద అన్న ప్రసాదం స్వీకరించారు. ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండము వద్ద కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.

Next Story

Most Viewed