అల్లూరి జిల్లా రైవాడ డ్యామ్‌లో పడవ బోల్తా.. ముగ్గురు మృతి

by Naga Rani Yarlagadda |

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం జీనబాడులో విషాదం నెలకొంది.

అల్లూరి జిల్లా రైవాడ డ్యామ్‌లో పడవ బోల్తా.. ముగ్గురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం జీనబాడులో విషాదం నెలకొంది. రైవాడ డ్యామ్ లో పడవ బోల్తా పడటంతో ముగ్గురు మృతి చెందారు. మిగతా వారికోసం డ్యామ్ లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. డ్యామ్ వద్దకు చేరుకున్న పోలీసులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాద సమయంలో పడవలో ఎంతమంది ఉన్నారన్నదానిపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story