అతనిపై విమర్శలు చేసి నా స్థాయి తగ్గించుకోను: సుజనా చౌదరి

by Disha Web Desk 2 |
అతనిపై విమర్శలు చేసి నా స్థాయి తగ్గించుకోను: సుజనా చౌదరి
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నేతలపై బీజేపీ ఎంపీ అభ్యర్థి సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. కేశినేని నాని స్థాయికి తాను దిగజారలేనని అన్నారు. ఎప్పుడూ ప్రత్యర్థులపై కామెంట్ చేయను అని తెలిపారు. ‘ఎన్నికల సమయంలో అసంతృప్తులు సహజం. నేను విజయవాడ దుర్గమ్మ ఆలయంలోనే పుట్టాను. విజయవాడకు నేను చేయగలిగేది చేస్తా’ అని హామీ ఇచ్చారు. కాగా, వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మొత్తం 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాల్లో బరిలో ఉండనుంది. ఇప్పటికే అభ్యర్థులను సైతం ప్రకటించింది. విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి లోక్‌సభ బరిలో పోటీకి దిగారు.

Next Story