పారిస్‌లో అఖిలపక్షం పర్యటన.. ఉగ్రవాదంపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-27 01:15:04  IST  )

భారతదేశం చాలా కాలంగా సరిహద్దు ఉగ్రవాదం వల్ల చాలా కాలంగా బాధపడుతోందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు..

పారిస్‌లో అఖిలపక్షం పర్యటన.. ఉగ్రవాదంపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం(India) చాలా కాలంగా సరిహద్దు ఉగ్రవాదం(Terrorism) వల్ల చాలా కాలంగా బాధపడుతోందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి (AP BJP Chief Purandeswari) అన్నారు. పారిస్‌(Paris)లో అఖిలపక్షం టీమ్ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ ఉగ్రవాదం కొనసాగకూడదని తాము కోరుకుంటున్నామని చెప్పారు. కానీ భారతదేశాన్ని పాకిస్తాన్ మరింత బాధపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉందని తెలిపారు. ‘‘ఇప్పుడు భారతదేశం ఉగ్రవాదం వద్దు అని చెబుతోంది. మనకు మంచి నాయకత్వం ఉంది. మనం ఏ దేశంపైనా యుద్ధం చేయలేదు. చాలా కాలంగా మన దేశంపై దేశ ప్రాయోజిత ఉగ్రవాదం దాడి చేస్తోంది. మన దేశస్థులకు మాత్రమే కాకుండా ప్రపంచానికి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ తిరిగి సమాధానం చెప్పాలి.’’ అని పురందేశ్వరి తెలిపారు.

Next Story