విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంటర్ పరీక్షల్లో భారీ మార్పులు

by Muthe.Rajitha |

ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.

విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంటర్ పరీక్షల్లో భారీ మార్పులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. వచ్చే ఏడాది ఇంటర్మీడియేట్ పరీక్షల సరళి మారనుందని ప్రకటించింది. ఇంటర్ 1st ఇయర్‌ పరీక్షల్లో బుక్‌లెట్ పేజీలను 24నుంచి 32కు పెంచారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, కామర్స్‌కు 32 పేజీలు ఉంటాయి. బయాలజీలో వృక్షశాస్త్రం, జంతుశాస్త్రానికి 24పేజీల చొప్పున 2 బుక్‌లెట్లు ఇస్తారు.

భౌతిక, రసాయన, జీవశాస్త్ర పరీక్షలు 85 మార్కులకు పాస్ మార్క్స్ 29. కొన్ని సబ్జెక్టుల్లో 30% వచ్చినా, మొత్తం 35% ఉంటే పాస్‌గా పరిగణిస్తారని ఇంటర్ బోర్డు పేర్కొంది. కావున దీనికి అనుగుణంగా అధ్యాపకులు బోధనకు సిద్ధంగా ఉండాలని కళాశాలలకు సూచించింది.

Next Story