- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అన్యమతాల వారికి టీటీడీ సత్రం కాదు’.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
అన్యమతాల వారికి టీటీడీ ధర్మసత్రం కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: అన్యమతాల వారికి టీటీడీ ధర్మసత్రం కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. టీటీడీ ఎవరి ఆస్తి కాదు, హిందువులది మాత్రమే అని తెలిపారు. ఈ రోజు(శుక్రవారం) ఆయన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. సనాతన ధర్మం కోసం ప్రజలు కలిసికట్టుగా ఉండాలని ప్రార్థించానన్నారు. ధూప దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలను టీటీడీ రక్షించాలని కోరారు. పురాతన ఆలయాలు గుర్తించి అభివృద్ధికి నిధులివ్వాలన్నారు. కొండగట్టు, కరీంనగర్ రామాలయాలను అభివృద్ధి చేయాలని టీటీడీ చైర్మన్కు విజ్ఞప్తి చేశారు. వేములవాడ, ఇల్లంతకుంట రామాలయాలను కూడా అభివృద్ధి చేయాలన్నారు. టీటీడీలో వెయ్యి మందికి పైగా అన్యమతస్తులు ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న వారిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
Next Story






