Veera Simha Reddy : ఒంగోలుకు చేరుకున్న బాలకృష్ణ

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-01-06 12:19:00  IST  )

అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ ఒంగోలు చేరుకున్నారు. బాలయ్య, శృతిహాసన్ జంటగా నటించిన వీరసింహారెడ్డి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఆయన ఒంగోలు చేరుకున్నారు.

Veera Simha Reddy : ఒంగోలుకు చేరుకున్న బాలకృష్ణ
X

దిశ, డైనమిక్ బ్యూరో : అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ ఒంగోలు చేరుకున్నారు. బాలయ్య, శృతిహాసన్ జంటగా నటించిన వీరసింహారెడ్డి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఆయన ఒంగోలు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి చాపర్‌లో ఒంగోలు బయలుదేరారు. బాలకృష్ణ వెంట శృతిహాసన్, బి.గోపాల్, నిర్మాత నవీన్ ఎర్నేనిలు వేదిక వద్దకు చేరుకున్నారు. మరికాసేపట్లో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇకపోతే వీర సింహారెడ్డి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదట ఒంగోలులోని ఏబీఎం గ్రౌండ్‌లో జరగాల్సి ఉంది. అయితే పోలీసులు అనుమతి నిరాకరించడంతో అది కాస్తా బీఎంఆర్ అర్జున్ ఇన్‌ఫ్రా గ్రౌండ్స్‌కు వేదిక మార్చిన సంగతి తెలిసిందే.

Next Story