వివేకా హత్యపై షర్మిల వ్యాఖ్యలకు అవినాశ్ రెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్

by Disha Web Desk 16 |
వివేకా హత్యపై షర్మిల వ్యాఖ్యలకు అవినాశ్ రెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారంలో వివేకా హత్యపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ కేసు నిందితులను పక్కనే పెట్టుకుని తిరుగుతున్నారని, వారిని కాపాడుతున్నారి ఆమె ఆరోపిస్తున్నారు. అంతేకాదు వివేకాను హత్య చేసింది ఎవరో అందరికీ తెలుసని ప్రచారం చేస్తున్నారు. వివేకా హత్య నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న అవినాశ్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్లు చర్చ జరుగుతోంది. దీంతో శనివారం ఆయన స్పందించారు. వివేకా హత్యపై షర్మిల చేసిన వ్యాఖ్యలు వినడానికే భయంకరంగా ఉన్నాయన్నారు. ‘మసి పూస్తారు.. బురద జల్లుతారు. తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు. అందుకే వారి విజ్ఞతకే వదిలేస్తున్నా.’ అని అవినాశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

Next Story