గోవా గవర్నర్‌గా ప్రమాణం చేసిన అశోక్ గజపతిరాజు.. హాజరైన టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-26 08:36:38  IST  )

గోవా గవర్నర్‌గా సీనియర్‌ నేత పూసపాటి అశోక్‌ గజపతిరాజు (Ashok Gajapathi Raju) ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు.

గోవా గవర్నర్‌గా ప్రమాణం చేసిన అశోక్ గజపతిరాజు.. హాజరైన టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు
X

దిశ, వెబ్‌డెస్క్: గోవా 20వ గవర్నర్‌గా పూసపాటి అశోక్‌ గజపతిరాజు (Ashok Gajapathi Raju) ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు గవర్నర్‌ బంగ్లా దర్బార్‌ హాలులో సరిగ్గా ఉదయం 11 గంటలకు ఆయనతో గోవా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్‌తో పాటు ఆ రాష్ట్ర మంత్రివర్గం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు నారా లోకేశ్, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్, పలువురు టీడీపీ ఎంపీలు హాజరయ్యారు.

Next Story