- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వైసీపీకి ఓటెస్తే మెడకు ఉరితాడు బిగించుకున్నట్లే.. కొత్తపల్లి గీత సన్సేషనల్ కామెంట్స్
దిశ, వెబ్ డెస్క్: వైసీపీకి ఓటేస్టే మెడకు ఉరితాడు బిగించుకున్నట్లేనని అరకు కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత సన్సేషనల్ కామెంట్స్ చేశారు. పాడేరు కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరితో కలిసి అల్లూరు జిల్లా కొయ్యూరులో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ షోలో మాట్లాడుతూ జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం సర్వ నాశనమైందని చెప్పారు. అభివృద్ధి కుంటపడటంతో రాష్ట్రం మరో 20 ఏళ్లు వెనక్కి పోయిందని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే జాబ్ కేలెండర్ ప్రకటిస్తామన్న హామీ ఏమైంది జగన్ అంటూ కొత్తపల్లి గీత ప్రశ్నించారు. మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానని చెప్పిన విషయం ఏమైందన్నారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మరోసారి అధికారం ఇవ్వాలని అడుగుతున్నారని నిలదీశారు. నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు చారిత్రాత్మక నిర్ణయమని అరకు కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత తెలిపారు.