Terrible Accident: విద్యానికేతన్ స్కూల్ కరెస్పాండెంట్‌ దుర్మరణం

by Disha Web Desk 16 |
Terrible Accident: విద్యానికేతన్ స్కూల్ కరెస్పాండెంట్‌ దుర్మరణం
X

దిశ, డైనమిక్ బ్యూరో: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఘోర ప్రమాదం జరిగింది. దేవరకొండ దర్శనానికి వెళ్లి వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఉమాపతి అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుడు ఉమాపతి అనంతపురం నగరానికి చెందిన విద్యానికేతన్ స్కూల్ కరెస్పాండెంట్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతుడి కుటుంబానికి సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


Next Story

Most Viewed