కుక్క కాటుతో చికిత్స పొందుతూ చిన్నారి మృతి

by Disha Web Desk 16 |
కుక్క కాటుతో చికిత్స పొందుతూ చిన్నారి మృతి
X

దిశ, కళ్యాణదుర్గం: కుక్క కాటుకు చిన్నారి మృతి చెందారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్రహ్మసముద్రం మండలం ముప్పుల కుంట గ్రామానికి చెందిన చిన్నారిని రెండు నెలల క్రితం కుక్క కరిచింది. అయితే అప్పటి నుంచి కూడా చిన్నారి అనారోగ్యంగానే ఉన్నారు. ఇటీవల కాలంలో చిన్నారి ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయితే ఆరోగ్యం మరింత విషమించడంతో బెంగళూరు కిమ్స్‌లో చేర్చించారు. అయితే చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందారు. దీంతో ముప్పలకుంట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed