- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Anantapur: లక్ష్మంపల్లిలో దారుణం.. కాపు కాసి రైతుపై దుండగుల దాడి
by Disha Web Desk 16 |
X
దిశ కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా శెట్టూరు మండలం లక్ష్మంపల్లిలో రైతు చంద్రన్నపై దుండగులు దాడి చేశారు. సోమవారం ఉదయం పొలం పనులకు వెళ్తున్న చంద్రన్నను కాపు కాసి మరీ పిడుగుద్దులు కురిపించారు. కేసు వెనక్కి తీసుకోవాలని, లేకపోతే కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు. అయితే దుండగుల దాడిలో చంద్రన్నకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను మెరుగైన చికిత్స కోసం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం అదే కుటుంబానికి సంబంధించిన వైసీపీ కార్యకర్త నాగభూషణ్పై ఓ యువకుడు గొడ్డలితో దాడి చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అదే కుటుంబానికి సంబంధించిన రైతు చంద్రన్నపై దాడి జరగడంతో నాగభూషణ్పై దాడి చేసిన యువకుడిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపైనా పోలీసుల కేసు నమోదు చేశారు.
Next Story