తిరుపతిలో క‌ల‌క‌లం...గోపురం పైకి ఎక్కి ఓ వ్యక్తి హ‌ల్చ‌ల్

by velandi.Saikiran |   (  Updated:2026-01-03 02:17:19  IST  )

తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఏకాంత సేవ అనంతరం ఆల‌యం మూసివేసిన తర్వాత లోపలికి ఓ అజ్ఞాత వ్యక్తి ప్రవేశించాడు.

తిరుపతిలో క‌ల‌క‌లం...గోపురం పైకి ఎక్కి ఓ వ్యక్తి హ‌ల్చ‌ల్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: తిరుపతిలో క‌ల‌క‌లం. తిరుపతిలో మ‌రోసారి భద్రతా వైఫల్యం బ‌య‌ట‌ప‌డింది. తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆల‌యం లోపలికి ఓ అజ్ఞాత వ్యక్తి ప్రవేశించాడు. ఈ త‌రుణంలోనే అలయం లోపల ఆ అజ్ఞాత వ్యక్తి హాల్ చల్ చేశాడు. మద్యం మత్తులో ఆలయం లోపలికి ప్రవేశించి, ర‌చ్చ చేశాడు. విజిలెన్స్ సిబ్బంది అడ్డుకునే లోపే మహాద్వారం లోపలికి ప్రవేశించాడు. అనంత‌రం గోపురంపైకి ఎక్కి కేకలు వేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఈస్ట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది, కిందికి దిగిరవాలంటూ విజ్ఞప్తి చేశారు. చాలా సేపు ప్రయత్నించి ఆ వ్య‌క్తిని కిందికి దింపారు. ఈ సంఘ‌ట‌నపై ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉంది. క్లిక్

Next Story