అమిత్ షా ప్రసంగంలో పస లేదు..సజ్జల సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 18 |
అమిత్ షా ప్రసంగంలో పస లేదు..సజ్జల సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యర్థులపై మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ప్రచారంలో భాగంగా కేంద్ర హోం వ్యవహారాల మంత్రి అమిత్ షా నేడు ఏపీలో హిందూపురం లోక్‌సభ పరిధిలో పర్యటించారు. ఈ నేపథ్యంలో అమిత్ షా ధర్మవరంలో కూటమి నేతల సభలో పాల్గొని ప్రసంగించారు. అమిత్ షా మాటల పై తాజాగా సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రోజూ మాట్లాడేదే అమిత్ షా చెప్పారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. కూటమిలో ఉన్నాము కాబట్టి ఏదో మాట్లాడాలంటే మాట్లాడినట్టుగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్న అమిత్ షా వ్యాఖ్యలకు సజ్జల కౌంటర్ ఇచ్చారు. 2014-2019 మధ్య ఉన్న కూటమి ప్రభుత్వంలో అవినీతి జరిగిందని..అందులో బీజేపీ కూడా భాగస్వామిగా ఉందని సజ్జల ఆరోపించారు.

Next Story

Most Viewed