Crime News : భర్తపై సలసల మరిగే నూనె పోసిన భార్య

by Disha Web Desk 21 |
Crime News : భర్తపై సలసల మరిగే నూనె పోసిన భార్య
X

దిశ, డైనమిక్ బ్యూరో : భర్త మద్యానికి బానిసగా మారాడు. ఫుల్‌గా మద్యం సేవించి కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. భార్య బిడ్డలు భాగోగుల గురించి ఆలోచనే చేయడం లేదు. ఆ ఇల్లాలు ఇవన్నీ భరిస్తూ వచ్చింది. చివరకు ఫుల్‌గా మందుకొట్టి భార్యతో గొడవపడటం మెుదలు పెట్టాడు. అయినా సహనంతో భరించింది. ఇక రోజూ తాగి రావడం..గొడవ పెట్టుకోవడం చేయి చేసుకోవడం షరా మామూలుగా మారింది. దీంతో భర్త వేధింపులు భరించలేకపోయిన ఆ ఇల్లాలు సలసల మరిగే వేడి నూనెను ఒంటిపై పోసింది. ఆదివారం జరిగిన ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ చిట్టినగర్‌లో దుర్గారావు, శ్రావణి దంపతులు జీవిస్తున్నారు. దుర్గారావు స్థానికంగా వున్న ఓ అల్యూమీనియం కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే దుర్గారావు ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. భార్య బిడ్డలను పట్టించుకోవడం లేదు.

పీకల్లోతు తాగి వచ్చి ఆమైకంలో ఇంటికివచ్చి భార్య శ్రావణితో గొడవపడుతుండేవాడు. అంతేకాదు తాగి కొట్టేవాడు. దీంతో అతడి వేధింపులు తీవ్రమయ్యాయి. ఫుల్‌గా మద్యం సేవించడం, గొడవ పెట్టుకోవడం,కొట్టడం నిత్యకృత్యంగా మారడంతో భార్య శ్రావణి తట్టుకోలేకపోయింది. భర్త వేధింపులు శృతిమించడంతో సహనం కోల్పోయిన భార్య శ్రావణి దారుణానికి పాల్పడింది. ఆదివారం ఫుల్లుగా మందుతాగి ఇంటికివచ్చిన దుర్గారావు భార్యతో గొడవపడ్డాడు. ఆ మత్తులోనే వెళ్లి మంచంపై పడుకున్నాడు. అప్పటికే కోపంతో రగిలిపోతున్న శ్రావణి సలసల కాగే వేడినీటిని తీసుకువచ్చి పడుకున్న భర్తపై పోసింది. దీంతో దుర్గారావు ముఖం, ఛాతీ,రెండు చేతులు, వీపుపై బొబ్బలు వచ్చింది. దీంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో కుటుంబ సభ్యులు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే దుర్గారావు తనను హత్య చేసేందుకు భార్య ప్రయత్నించిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజయవాడ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed