వివాహేతర సంబంధం ఎఫెక్ట్.. కన్నకూతురిని చంపేసిన తల్లి

by Disha Web Desk 2 |
వివాహేతర సంబంధం ఎఫెక్ట్.. కన్నకూతురిని చంపేసిన తల్లి
X

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా తాడికొండ మండలం బండారుపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఆరేళ్ల బాలికను కన్నతల్లి హతమార్చింది. వివరాల్లోకి వెళితే.. సిద్దార్థ అనే వ్యక్తి బండారుపల్లిలో నివసిస్తున్నాడు. ఇటీవల ఆయనకు హైదరాబాద్‌కు చెందిన మహిళతో పరిచయం ఏర్పడింది. అదికాస్త సహజీవనానికి దారి తీసింది. దీంతో ఇటీవల సదరు మహిళను గ్రామానికి తీసుకొచ్చి ఆమెతో కలిసి జీవిస్తున్నాడు. ఆ మహిళకు ఆరేళ్ల కూతురు ఉంది. దీంతో ఆ పాప వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ప్రియుడు సిద్ధార్థతో కలిసి కన్నకూతురిని హతమార్చింది ఆ తల్లి. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ప్లాన్ ప్రకారం తగులబెట్టారు. కొన్నిరోజుల తర్వాత బంధువులు పాప విషయమై ఆరా తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసుల సమక్షంలో ఆమె అసలు విషయం చెప్పారు. నిందితుడు సిద్దార్థ కర్నూలు జిల్లా ఆలూరు వాసిగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story