పార్వతీపురం బస్టాండులో భారీ పేలుడు... ఆరుగురు ప్రయాణికులకు గాయాలు

by Vemula.Srinu Prasad |

పార్వతీపురం బస్టాండులో భారీ పేలుడు సంభవించింది...

పార్వతీపురం బస్టాండులో భారీ పేలుడు... ఆరుగురు ప్రయాణికులకు గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: పార్వతీపురం బస్టాండు(Parvatipuram Bustand)లో భారీ పేలుడు సంభవించింది. బస్టాండులో ప్రయాణికులు వేచివున్నసమయంలో ఆర్టీసీ బస్సు(Rtc Bus)లో ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు జరిగింది. దీంతో స్థానికంగా ఉన్న ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. బాణా సంచా బాక్సు నుంచి పేలుడు సంభవించినట్లు గుర్తించారు. ఆర్టీసీ బస్సుపై నుంచి దింపుతుండగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన ఆరుగురిని మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అయితే వీరిలో ఇద్దరి పరిస్తితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story