- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా
by Disha Web Desk 2 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే కర్నాటక నుండి రాజమహేంద్రవరం వైపు చేపల లోడుతో లారీ వెళ్తుంది. అయితే లారీ జీలుగుమిల్లి మండలంలోని దర్భగూడెం సబ్ స్టేషన్ వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా అదుపుతప్పింది. అనంతరం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్లకు గాయాలయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 108లో క్షతగాత్రులను జంగారెడ్డి గూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న జీలుగుమిల్లి పోలీసులు ప్రమాదంపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. క్షతగాత్రుల వాంగ్మూలాన్ని సైతం నమోదు చేసుకున్నారు.
Next Story