- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనసేనలో కీలక పరిణామం: పిఠాపురం ఇంచార్జి తొలగింపు.. మరొకరికి బాధ్యతలు
కాకినాడ జిల్లా పిఠాపురం జనసేనలో కీలక పరిణామం చోటు చేసుకుంది...

X
దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా పిఠాపురం జనసేన(Pithapuram Janasena)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పిఠాపురంలో గతకొంతకాలంగా వర్గవిభేదాలు తలెత్తుతున్నాయి. దీంతో అధిష్టానం వద్దకు ఫిర్యాదులు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని ప్రక్షాళన చేయాలని పవన్ కల్యాణ్(Pawan Kalyan) నిర్ణయించారు. ఈ మేరకు ఫైవ్ మెన్ కమిటీ నుంచి మర్రెడ్డి శ్రీనివాస్ను తొలగించారు. గతంలో పార్టీ ఇంఛార్జ్గా ఆయన పని చేశారు. 2 నెలల క్రితం ఇంఛార్జ్ స్థానంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ఐదుగురితో కమిటీ వేశారు. మర్రెడ్డిపై వస్తున్న ఫిర్యాదులతో కమిటీ నుంచి కూడా తొలగింపు నిర్ణయం వచ్చింది. దీంతో మర్రెడ్డి స్థానంలో ఓదూరి కిషోర్కు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.
Next Story






