- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirupati: వినాయక చవితి వేడుకలో ఘర్షణ.. ఉద్రిక్తత
by Vemula.Srinu Prasad |
వినాయక చవితి వేడుకలో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ తలెత్తింది. ....

X
దిశ, వెబ్ డెస్క్: వినాయక చవితి వేడుకలో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ వివాదం కాస్త చిలికి చిలికి రెండు గ్రామాలకు పాకింది. దీంతో రెండు గ్రామాల ప్రజలు ఘర్షణలకు దిగారు. కర్రలతో దాడులకు పాల్పడ్డారు. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనతో తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం రాగిగుంట, పెరిందేశంలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంది. రాగిగుంట గ్రామంలో పెరిందేశం యువకులు అనుచితంగా ప్రవర్తించారు. స్థానిక యువకులను కొట్టమే కాకుండా వారి వాహనాలను సైతం ధ్వంసం చేశారు. దీంతో రెండు గ్రామాల మధ్య వివాదం మరింత ముదిరింది. విషయం తెలుసుకున్న పోలీసులు రెండు గ్రామాల్లో భారీగా మోహరించారు. పికెటింగ్ ఏర్పాటు చేశారు. మళ్లీ ఘర్షణలు చెలరేగకుండా పటిష్ట చర్యలు చేపట్టారు.
Next Story






