Atrocious: కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టిన కారు

by Disha Web Desk 3 |
Atrocious: కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టిన కారు
X

దిశ, ప్రతినిధి, విజయవాడ: మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టిన కొంతమంది ప్రజలు మాత్రం వాళ్ళ పంథాను మార్చుకోవడం లేదు.మద్యం సేవించి వాహనాలు నడపడం కారణంగా ప్రమాదాల భారిన పడుతున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలు. తాజాగా అలాంటి ఘటనే విజవాడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జగ్గయ్యపేట మండలం లోని షేర్ మహమ్మద్ పేట గ్రామంలో తుఫాన్ కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నది.

అయితే కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న సమయంలో. విద్యుత్ స్థంభం విరిగిపోవడం,విద్యుత్ ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. కాగా స్థానికుల సమాచారం ప్రకారం డ్రైవర్ మద్యం మత్తు లో ఉండి కారు నడపడం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.


Next Story