- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జ్వరంతో ఆస్పత్రిలో చేరి.. గుండెపోటుతో బాలిక మృతి
గుండెపోటు.. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా అన్ని వయసులవారినీ కబళిస్తోంది. ఇటీవల మహారాష్ట్రలో ఓ పిల్లాడు ఆడుకుంటూ అస్వస్థతకు గురై తల్లి ఒడిలో పడుకుని గుండెపోటుతో (Heart Attack) మరణించాడు.

దిశ, వెబ్డెస్క్: గుండెపోటు.. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా అన్ని వయసులవారినీ కబళిస్తోంది. ఇటీవల మహారాష్ట్రలో ఓ పిల్లాడు ఆడుకుంటూ అస్వస్థతకు గురై తల్లి ఒడిలో పడుకుని గుండెపోటుతో (Heart Attack) మరణించాడు. తాజాగా కృష్ణాజిల్లాలో 8వ తరగతి విద్యార్థిని గుండెపోటుతో మరణించడం కలకలం రేపింది. పామర్రు మండలం పెదమద్దాలికి (Pedamaddali) చెందిన విద్యార్థిని గుమ్మడి లావణ్య ఈనెల 5న తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా.. తల్లిదండ్రులు ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. జ్వరం ఎంతకూ తగ్గకపోవడంతో వైద్య పరీక్షలు చేయించారు. అంతలోనే బాలిక మరణించింది. జ్వరం కారణంగానే ఆమె మరణించిందా అని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో.. వైద్యులు బాలికను పరీక్షించి.. ఆమె మరణానికి గుండెపోటే ప్రధాన కారణంగా తేల్చారు. దీంతో లావణ్య తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. గుండెపోటుతో బాలిక మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.






