అల్పపీడనం ఎఫెక్ట్‌..నేటి నుంచి 5 రోజులు వర్షాలే!

by velandi.Saikiran |   (  Updated:2025-11-25 01:16:07  IST  )

ఏపీలో నేటి నుంచి దాదాపు 5 రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

అల్పపీడనం ఎఫెక్ట్‌..నేటి నుంచి 5 రోజులు వర్షాలే!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఏపీలో నేటి నుంచి దాదాపు 5 రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మలక్కా జలసంధి పరిసరాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కాస్త, ఇవాళ వాయుగుండంగా బలపడనున్నట్లు అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మరో 48 గంటల్లో ఆ వాయుగుండం తుఫాన్ గా మారే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది.

అదే సమయంలో ఇవాళ నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. వీటి ప్రభావం కారణంగా ఏపీలో వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. నేటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు దక్షిణ కోస్తా, రాయలసీమకు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక ఈ నెల 29, 30 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఉత్తర కోస్తాలో తేలిక పాటి వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రైతులు అలర్ట్ గా ఉండాలని కోరింది.

Next Story