కొనసాగుతున్న విచారణ.. ఈటల వ్యవహారంపై రేపే క్లారిటీ

by  |
కొనసాగుతున్న విచారణ.. ఈటల వ్యవహారంపై రేపే క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భూ అక్రమాల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట్ అలాగే, హకీంపేట్ గ్రామాలకు చెందిన కొందరు రైతుల భూములను కబ్జా చేసిన విషయం నిజమే అని విచారణ అనంతరం స్థానిక కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు. పూర్తి విచారణ అనంతరం ఈటల వ్యవహారంపై సోమవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం సైతం రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు అచ్చంపేటలో ఈటల స్వగ్రామంలో రెండోరోజూ విచారణ కొనసాగించనున్నారు.

Next Story

Most Viewed