అమృత రావ్‌ను కలిసేందుకు భయపడ్డ ఎంఎఫ్ హుస్సేన్..

by  |
Amrutha Rao, MF Hussain
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ అమృతా రావ్ లేట్ లెజెండరీ పెయింటర్ ఎంఎఫ్ హుస్సేన్‌ను స్మరించుకుంది. ఆయన బర్త్ యానివర్సరీ సందర్భంగా లైవ్‌లో తన పెయింట్ వేసిన సందర్భాన్ని గుర్తుచేసుకుంది. ‘వివాహ్’ మూవీ చూసి ఇంప్రెస్ అయిన ఎంఎఫ్ హుస్సేన్.. ఫొటో కాకుండా ప్రత్యక్షంగా తన బొమ్మ గీయాలనుకున్నాడని తెలిపింది. అందుకే తల్లితో పాటు తనను దుబాయ్‌కు పిలిపించారని, ఎయిర్‌పోర్టులో రిసీవ్ చేసుకున్నారని చెప్పింది. తమను పలకరించే సమయంలో చేతిలో బ్లాక్ పెయింట్ బ్రష్‌తో తన యాటిట్యూడ్ ఇప్పటికీ గుర్తుందన్న ఆమె.. చివరిరోజు తల్లితో మాట్లాడిన హుస్సేన్ జీ అమృతను ప్రత్యక్షంగా చూస్తే నిరాశ చెందుతానేమోననే భయం వెంటాడిందని చెప్పాడని తెలిపింది. అందుకే స్క్రీన్‌పై చూసిన అమృత నిజజీవితంలో అంత అందంగా ఉంటుందో లేదో అని సంకోచించానని, భయపడ్డానని తెలిపాడంది. కానీ తనను చూశాక నిరీక్షణను అధిగమించిన సంతోషం సొంతమైందని చెప్పాడని, ఊహించిన దానికంటే మరింత అందంగా ఉందని కితాబిచ్చాడంది అమృత. కాగా 2017లో అమృత.. ఎంఎఫ్ హుస్సేన్ లైవ్ పెయింటింగ్ వేసే ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.



Next Story

Most Viewed