ఆస్ట్రేలియాలో ప్రధాని మోడీ కార్యక్రమం.. చార్టర్డ్ ఫ్లైట్‌లో వెళ్లిన 170 మంది

భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆస్ట్రేలియాలో పర్యటిస్తానికి వెళ్లారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యేందుకు భారతీయ సంతతికి చెందిన దాదాపు

Update: 2023-05-23 05:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆస్ట్రేలియాలో పర్యటిస్తానికి వెళ్లారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యేందుకు భారతీయ సంతతికి చెందిన దాదాపు 170 మంది.. ఓ ప్యత్యేక చార్టర్డ్ ఫ్లైట్‌ను బుక్ చేసుకుని వెళ్లారు. మెల్‌బోర్న్‌లో జరిగే ఈ కార్యక్రమానికి సిడ్నీ నుంచి ఈ చార్టర్డ్ విమానం బయలుదేరి వెళ్లింది. కాగా దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. "మోడీ ఎయిర్‌వేస్" అని పిఎం మోడీ మద్దతుదారులు పేర్కొన్న విమానంలో ఇండియన్ ఆస్ట్రేలియన్ డయాస్పోరా ఫౌండేషన్ సభ్యులు త్రివర్ణ నేపథ్య తలపాగాలు జాతీయ జెండాలను ఊపుతూ కనిపించారు.

Tags:    

Similar News