కళ్యాణమహోత్సవంలో అవమానించారు: జోగిని శ్యామల నిరసన

శ్రీ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణమహోత్సవంలో అమ్మవారి దర్శనం కల్పించకుండా ఆలయ ఈఓ అన్నపూర్ణ తమను అవమానించారని జోగిని శ్యామల ఆరోపించారు.

Update: 2022-07-07 15:10 GMT

దిశ, ఖైరతాబాద్: శ్రీ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణమహోత్సవంలో అమ్మవారి దర్శనం కల్పించకుండా ఆలయ ఈఓ అన్నపూర్ణ తమను అవమానించారని జోగిని శ్యామల ఆరోపించారు. గురువారం ఆలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమ్మవారి కళ్యాణమహోత్సవం సందర్భంగా ఆలయంలో ఈఓ తమను చిన్న చూపు చూశారని అసహనం వ్యక్తం చేశారు. తమకు బోనాల కాంప్లెక్స్‌లో మంగళ, శుక్ర, ఆది వారాలలో దర్శనంతో పాటు పూజల కొరకు ప్రత్యేక గదులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తమకు సౌకర్యాలు కేటాయించకపోతే ఆలయం ఎదుట తమ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టనున్నట్లు ఆమె హెచ్చరించారు. ఎస్ఆర్ నగర్ సీఐ సైదులు వారి డిమాండ్లను మంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Similar News