అరుణమ్మ గెలిచాక విమానంలో అయోధ్యకు తీసుకెళ్తా: బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు

మహబూబ్నగర్ పార్లమెంట్ ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలుపే లక్ష్యంగా ప్రతి బీజేపీ నాయకుడు కార్యకర్త పనిచేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు.

Update: 2024-05-05 06:08 GMT

దిశ, నర్వ: మహబూబ్నగర్ పార్లమెంట్ ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలుపే లక్ష్యంగా ప్రతి బీజేపీ నాయకుడు కార్యకర్త పనిచేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు. ఎంపీ ఎన్నికల్లో అరుణమ్మ గెలిచాక మక్తల్ నియోజకవర్గంలోని ఆయా మండలాల అధ్యక్షులను బూత్ అధ్యక్షులను విమానంలో అయోధ్యకు తీసుకువెళ్తానని ఆయన నివాసంలో నర్వ మండలంతో పాటు అమరచింత, ఆత్మకూరు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదని ఈ విషయాన్ని ప్రతి గడపగడపకు తీసుకువెళ్లి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఓటర్లను చైతన్యం చేయాలన్నారు. మే 10వ తేదీన నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న బీజేపీ ఎన్నికల ప్రచార సభకు మోదీ హాజరు కారున్నారని పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి తరలిరావాలన్నారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి కావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. వెంకట్ రెడ్డి, బ్రహ్మణందరెడ్డి, నరేందర్ రెడ్డి, డా. వెంకటేశ్వర్ రావ్, జగన్నాథం, రవి, కుర్మన్న, శ్రీకాంత్, చంద్రకాంత్, రమేష్, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Similar News