భారత్ బయోటెక్ అధిపతి కృష్ణ ఎల్లాకు డీన్స్​ మెడల్

దిశ, నేషనల్ బ్యూరో : హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ కరోనా కష్టకాలంలో కొవాగ్జిన్ టీకాతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు కాపాడింది.

Update: 2024-05-24 18:11 GMT

దిశ, నేషనల్ బ్యూరో : హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ కరోనా కష్టకాలంలో కొవాగ్జిన్ టీకాతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు కాపాడింది. ఎన్నో ప్రపంచ దేశాలకు చౌక ధరకే కరోనా టీకాలను భారత్ బయోటెక్ సప్లై చేసింది. ఈ సేవా ప్రస్థానం నేపథ్యంలో భారత్​ బయోటెక్​ కో ఫౌండర్, ​ ఎగ్జిక్యూటివ్​ ఛైర్మన్ కృష్ణ ఎల్లాను జాన్స్​ హోప్​కిన్స్​ బ్లూమ్​బర్గ్​ స్కూల్​‌కు చెందిన అత్యున్నత పురస్కారం ‘డీన్స్​ మెడల్’​ వరించింది. ఆరోగ్య రంగంలో అందించిన విశిష్ఠ సేవలకుగానూ కృష్ణ ఎల్లాకు ఈ అవార్డును అందజేశామని జాన్స్​ హోప్​కిన్స్​ బ్లూమ్​బర్గ్​ స్కూల్​ ఆఫ్​ పబ్లిక్​ హెల్త్​ ప్రకటించింది. బ్లూమ్​బర్గ్​ స్కూల్​ స్నాతకోత్సవం సందర్భంగా డీన్​ ఎల్లన్​ జే మెకంజీ ఈ అవార్డును కృష్ణ ఎల్లాకు ప్రదానం చేశారు. ప్రజారోగ్య పరిరక్షణలో ఆయన​ పాత్ర అనిర్వచనీయమైందని కొనియాడారు. కొవిడ్​ సమయంలో కొవాగ్జిన్​తో వారు చేసిన సేవలను ప్రశంసించారు.

Tags:    

Similar News