New parliament building inauguration :నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన మోడీ

దేశ రాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన పార్లమెంట్ భవంతిని ప్రధాని మోడీ ప్రారంభించారు.

Update: 2023-05-28 03:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన పార్లమెంట్ భవంతిని ప్రధాని మోడీ ప్రారంభించారు. అంతకు ముందు సెంగోల్ కు మోడీ సాష్టాంగ నమస్కారం చేశారు. నూతన పార్లమెంట్ భవనంలో సెంగోల్ ను మోడీ ప్రతిష్టించారు. లోక్ సభ స్పీకర్ కుర్చీ వద్ద సెంగోల్‌ను ప్రతిష్టించిన మోడీ దానికి మొక్కారు. నూతన పార్లమెంట్ భవన నిర్మాణ కార్మికులకు మోడీ సన్మానం చేశారు. కార్మికులను శాలువాలతో సత్కరించి మోడీ జ్ఞాపికలను అందజేశారు. నూతన పార్లమెంట్ భవన ప్రాంగణంలో సర్వమత ప్రార్థనలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా వేద పండితుల ఆశీర్వాదాలను మోడీ తీసుకున్నారు. 

Read more:

ఇది 'నవ భారతదేశం' కోసం.. కొత్త పార్లమెంట్ భవనంపై షారుఖ్ ఖాన్

Tags:    

Similar News