బండి సంజయ్ ఒళ్లు దగ్గర పెట్టుకో.. మంత్రి పొన్నం ప్రభాకర్ వార్నింగ్

‘బండి సంజయ్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీ నాలుకకి దురద ఎక్కువైంది. కాంగ్రెస్‌ను విమర్శిస్తే తాట తీస్తాం’ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు.

Update: 2024-02-27 16:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ‘బండి సంజయ్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీ నాలుకకి దురద ఎక్కువైంది. కాంగ్రెస్‌ను విమర్శిస్తే తాట తీస్తాం’ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. మంగళవారం ఆయన మీడియాతో ఐదేళ్ల టైమ్‌లో ఎంపీగా కరీంనగర్‌కు ఏం చేశావో? స్పష్టంగా చెప్పు అంటూ మండిపడ్డారు. ప్రజలను ఇంకా మోసం చేయడం సరికాదన్నారు. బండి సంజయ్ రాజకీయ డ్రామాలకు తెర లేపుతూ ప్రజలను కన్​ప్యూజ్ చేస్తున్నారన్నారు. శ్రీరాముని పేరు మీద ఓట్ల అడగడం దారుణమన్నారు. జన్మనిచ్చిన తల్లులను కూడా రాజకీయాలకు ముడి పెట్టడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే యాత్రలు చేయలేడని హెచ్చరించారు.

Tags:    

Similar News