CM Revanth: ప్రధాని మోడీ, అమిత్ షా.. అలాంటి పని చేయకండి.. సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ రిక్వెస్ట్

లోక్‌‌సభ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా‌లకు విజ్క్షప్తి చేశారు.

Update: 2024-05-09 16:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌‌సభ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా‌లకు విజ్క్షప్తి చేశారు. ఇవాళ ఆయన ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మట్లాడుతూ.. తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టొదని, దుర్మార్గమైన ప్రయోగాలు చేయొద్దని రిక్వెస్ట్ చేశారు. పొరపాటున బీజేపీకే అధికారం వస్తే.. మతకల్లోలాలు పెచ్చరిల్లుతాయని ఆరోపించారు. ఇతర మతాల వారిని ఆ పార్టీ ఘోరంగా కించపరుస్తూ.. దాడులకు తెగబడుతోందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చి మోడీ, అమిత్‌ షా రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపించారు. నగరానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రానున్న క్రమంగా కేసీఆర్ స్థానాన్ని హారీష్ రావు ఆక్రమించడం పక్కా అని అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం హరీష్‌కు ముమ్మాటికీ లాభమేనని తెలిపారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నా.. హరీష్‌రావు ట్రాప్‌లో కేసఆర్ పడొద్దని, ఆయన అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు.     

Tags:    

Similar News