రాహుల్ గాంధీ భ్రమలో ఉన్నారా? ఒక్క రైతుకైనా ఎకరానికి రూ.7.500 వచ్చిందా?.. KTR సంచలన ట్వీట్

తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై సంచలన కామెంట్స్ చేశారు.

Update: 2024-05-09 15:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై సంచలన కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ భ్రమలో ఉన్నారా? తెలంగాణ ప్రజలతో డ్రామా ఆడుతున్నారా? అని సీరియస్ అయ్యారు. వేయని “ రైతుభరోసా” ను వేసినట్టు ఎందుకు అబద్ధాలు చెబుతున్నారు? ఎంతకాలం ఈ అసత్యాలను ప్రచారం చేస్తారని అడిగారు. ఎక్కడన్నా ఒక్క రైతుకైనా వచ్చిందా? ఎకరానికి రూ.7.500 వచ్చిందా? అన్నారు. నాట్ల నాడు ఇయ్యాల్సిన పెట్టుబడి సాయాన్ని పార్లమెంట్ ఓట్ల దాకా.. డైలీ సీరియల్‌లా సాగదీశారని ఎద్దేవా చేశారు. చివరికి పాత “రైతుబంధు” పూర్తిగా అందనేలేదు. రైతు భరోసాకైతే అసలు అడ్రసే లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. నాడు 15 లక్షలు వేస్తానన్న బడాభాయ్ వేయలేదు.. నేడు 15 వేలు ఇస్తానన్న ఛోటాబాయ్ ఇయ్యలేదు అని విమర్శలు గుప్పించారు.

మరి రైతుభరోసా వేసినట్టు ఎందుకీ ఫోజులు? అని ప్రశ్నించారు. అసత్యాలపై కాంగ్రెస్ స్వారీ.. ఇంకెన్ని రోజులు? అని అన్నారు. డిసెంబర్ 9న చేస్తానన్న రెండు లక్షల రుణమాఫీ జాడేది? కౌలు రైతులకు, కూలీలకు చేస్తామన్న సాయం సంగతేది? ఇదేనా మీరు చెప్పిన ప్రజాపాలన? నమ్మి ఓటేసిన పాపానికి ఏంటీ ఈ నయవంచన? ఇది ప్రజాపాలన కాదు.. ముమ్మాటికీ ఇది ప్రజా వ్యతిరేక పాలన అని తెలిపారు. 420 మోసపూరిత వాగ్ధానాలతో నాలుగుకోట్ల ప్రజలను వంచించిన పాలన.. ఒక్క మాట మాత్రం నిజం.. గాలిమాటల గ్యారంటీలను నమ్మి అసెంబ్లీ ఎన్నికల్లో ఆగమైంది తెలంగాణ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాచైతన్యం వెల్లివిరుస్తుందని, తెలంగాణకున్న ఏకైక గొంతుక BRS వైపే ప్రజాతీర్పు ప్రతిధ్వనిస్తుందని అన్నారు.

Similar News