BREAKING: రాష్ట్రంలో బీజేపీని గెలిపించేందుకు కేసీఆర్ చూస్తుండు: సీఎం రేవంత్‌రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

రాష్ట్రంలో బీజేపీని గెలిపించేందుకు కేసీఆర్ చూస్తున్నాడని సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-09 16:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో బీజేపీని గెలిపించేందుకు కేసీఆర్ చూస్తున్నాడని సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇవాళ ఆయన ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు స్పేస్ లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఆరు నుంచి ఏడు స్థానాల్లో డిపాజిట్లు కూడా రావని అన్నారు. అసలు ఎలక్షన్ల బరిలో బీఆర్ఎస్ పార్టీనే లేదన్నారు. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని.. బీజేపీని గెలిపించేందుకు కేసీఆర్ చూస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే చేవెళ్ల, మహబూబ్‌నగర్, మల్కాజ్‌గిరి, జహీరాబాద్‌లలో కనీసం ప్రచారం కూడా చేయట్లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో 51 శాతం ఓట్లు రావాలనేదే తన టార్గెట్ అని రేవంత్ తెలిపారు. రాష్ట్రంలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్యేనని స్పష్టం చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్వేచ్ఛాయుత వాతావరణం ఉండేది కాదనా, కానీ తమ ప్రభుత్వంలో అందరికీ స్వేచ్ఛనిచ్చామని పేర్కొన్నారు. 

Tags:    

Similar News