అంబేద్కర్ రాజ్యాంగం వల్లే తెలంగాణ సిద్ధించింది: ఎమ్మెల్యే చిట్టెం

Update: 2022-12-06 07:59 GMT

దిశ, మక్తల్: అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ పోరాటానికి ఫలితం దక్కిందని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం రోజు చౌరస్తాల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66 వ వర్ధంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిన్న రాష్ట్రాలతోనే సాధ్యమని.. ప్రజలకు మేలైన వసతి సౌకర్యాలు, దేశ అభివృద్ధి ఫలాలు అందించడానికి వీలుంటుందని అన్నారు.

తెలంగాణ ప్రజల అదృష్టం మేరకు రాష్ట్రం ఏర్పాటు కావడానికి రాజ్యాంగంలో పొందుపరచడం వల్లే సాధ్యమైందని తెలిపారు. వెనుకబడిన వర్గాలకు అభివృద్ధి చెందాలని, రిజర్వేషన్లను ప్రవేశపెట్టారని అందరూ కలిసికట్టుగా దేశ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, నర్సింహులు, ఉపాధ్యక్షులు బండారి ఆనంద్, గొల్లపల్లి నారాయణ, మాజీ మార్కెట్ చైర్మన్ నరసింహ గౌడ్ పాల్గొన్నారు.

Similar News