50 రూపాయలకు పండ్లు ఇవ్వలేదని దుకాణానికి నిప్పు పెట్టిన వర్కర్

నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని శ్రీపురం చౌరస్తాలో సోమవారం(ఈ నెల 22) రాత్రి గాలి వేగంగా వీచడంతో కరెంటు వైర్లు తగిలి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటన పాఠకులకు విదితమే.

Update: 2024-04-29 16:14 GMT

దిశ, నాగర్ కర్నూల్ :- నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని శ్రీపురం చౌరస్తాలో సోమవారం(ఈ నెల 22) రాత్రి గాలి వేగంగా వీచడంతో కరెంటు వైర్లు తగిలి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటన పాఠకులకు విదితమే. ఈ ఘటన పై సీఐ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం...సోమవారం రాత్రి షాప్ యాజమానిని 50 రూపాయల పండ్లు అడిగితే ఇవ్వలేదని ఆ దుకాణం లో పనిచేసే వర్కర్ ఆసిద్ (40) దుకాణానికి నిప్పు పెట్టడంతో ఆ దుకాణాలతోపాటు పక్కనే ఉన్న నాలుగు దుకాణాలు ఖాళీ బూడిదయ్యాయి. అగ్ని ప్రమాదానికి కారణమైన దుండగుడిని సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నామన్నారు.

Similar News