మహబూబ్ నగర్ పార్లమెంటు బరిలో 31 మంది అభ్యర్థులు

పార్లమెంటు ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం ముగిసిన తర్వాత 11 వ మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల బరిలో 31 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి,జిల్లా కలెక్టర్ రవినాయక్ తెలిపారు.

Update: 2024-04-29 13:58 GMT

 దిశ, ప్రతినిధి,మహబూబ్ నగర్: పార్లమెంటు ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం ముగిసిన తర్వాత 11 వ మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల బరిలో 31 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి,జిల్లా కలెక్టర్ రవినాయక్ తెలిపారు. నలుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులైన మహ్మద్ ఇంతియాజ్,మహ్మద్ అబ్ధుల్ రహీం,శ్రీకాంత్ పిల్లెల,కె.జంగయ్య లు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ రవినాయక్ తో పాటు ఎన్నికల సాధారణ పరిశీలకులు షేవాంగ్ గ్యాచో భూటియా,అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ల సమక్షంలో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు.

Similar News