రాముడు ఏ ఒక్కరి సొత్తు కాదు.. మాజీ మంత్రి KTR

బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన సవాల్ విసిరారు.

Update: 2024-05-06 05:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాముడు ఏ ఒక్కరి సొత్తు కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో సోమవారం కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అరచేతిలో కాంగ్రెస్ వైకుంఠం చూయించిందన్నారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందన్నారు. ఆరు గ్యారంటీల్లో ఒక్కటి అమలు చేసి.. పురుషులు, మహిళల మధ్య కొట్లాట పెట్టారన్నారు. 100 రోజుల్లో పెన్షన్లు, రుణమాఫీ వచ్చాయా అని ప్రశ్నించారు. మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. చమురు ధరలు తగ్గినా పెట్రల్‌పై ధర తగ్గించలేదన్నారు. మనకు అక్కరకు రాని వారికి ఎందుకు ఓటు వేయాలని క్వశ్చన్ చేశారు. బీఆర్ఎస్‌కు ఓటు వేసి గెలిపిస్తే.. కేంద్రంపై పోరాడే శక్తి వస్తుందన్నారు. 


Similar News