టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు మృతి
స్వాతంత్ర సమరయోధుడు, ఏపీ మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు గోపాల కృష్ణ (64) హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు.
దిశ, వెబ్డెస్క్: స్వాతంత్ర సమరయోధుడు, టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు గోపాల కృష్ణ (64) హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు తెలిసింది. ప్రకాశం పంతులుకు ఇద్దరు కుమారులు.. కాగా హనుమంతరావు కుమారుడు గోపాలకృష్ణ సోమవారం వేకువజామున కన్నుమూశారు. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.