పండగపూట తీవ్ర విషాదం.. తల్లి, కూతురు స్పాట్ డెడ్

నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ లారీ అదుపుతప్పి బైకును బలంగా ఢీకొట్టింది.

Update: 2023-03-07 08:00 GMT

దిశ, మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ లారీ అదుపుతప్పి బైకును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి ఆదిలక్ష్మి(35), కుమార్తె ప్రశాంతి (13) అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న వాడపల్లి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుల బాపట్ల జిల్లా కొండమంజులూరు గ్రామ వాస్తులుగా గుర్తించారు. హోలీ పండగరోజున హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.



 



 


Tags:    

Similar News