అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టుకున్న పోలీసులు?
మండలంలోని ఇల్లందు మహబూబాబాద్ ప్రధాన రహదారిపై వాహన తనిఖీలు జరిగాయి.
దిశ, బయ్యారం: మండలంలోని ఇల్లందు మహబూబాబాద్ ప్రధాన రహదారిపై వాహన తనిఖీలు జరిగాయి. ఇందులో భాగంగా ట్రైన్ ఎస్పీ తన సిబ్బందితో శనివారం వాహన తనిఖీలు చేస్తుండగా బస్సులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని మండల సరిహద్దు బస్సును వెంబడించి గంజాయిని పట్టుకున్నట్లు సమాచారం. మండలంలో పలువురు, చర్చించుకుంటున్నారు. ఎన్ని కేజీలు గాంజా పట్టుకున్నారో పూర్తి వివరాలు పోలీసు అధికారుల ద్వారా సమాచారం తెలియాల్సి ఉంది. దీనిపై సీఐ రవికుమార్ వివరణ కోరగా అలాంటిది ఏమి జరుగలేదని, పట్టుకుంటే మీడియాకు తెలుపుతామని వెల్లడించారు.