గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి చెందిన ఘ‌ట‌న మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది.

Update: 2024-05-05 05:21 GMT

దిశ‌, మంచిర్యాల: గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి చెందిన ఘ‌ట‌న మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. పంజాల స‌తీష్ (40) మంచిర్యాల పోలీస్‌స్టేష‌న్‌లో కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తున్నాడు. వేసవి వేళ రోజూ లాగే పిల్లల‌తో క‌లిసి సీసీసీ న‌స్పూరులో స్విమ్మింగ్‌పూల్‌కు వెళ్లాడు. అక్కడ స్విమ్మింగ్ చేస్తుండ‌గానే గుండెపోటు రావ‌డంతో అక్కడిక్కడే చ‌నిపోయాడు. మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించి, కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. స‌తీష్ శ‌నివారం త‌న ఓటు కూడా వేసుకుని విధులు నిర్వహించాడు.

Tags:    

Similar News