తిర్యాణి మండలంలో అగ్ని ప్రమాదం.. మంటల్లో కాలీపోయిన ఆరు ఇల్లు (వీడియో)

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం పంగిడి మాదర గ్రామపంచాయతీలోని సల్పలగూడలో సోమవారం అర్ధరాత్రి గిరిజనులు ఆరు ఇళ్లు దగ్ధమయ్యాయి.

Update: 2023-02-07 05:41 GMT

దిశ, తాండూర్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం పంగిడి మాదర గ్రామపంచాయతీలోని సల్పలగూడలో సోమవారం అర్ధరాత్రి గిరిజనులు ఆరు ఇళ్లు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన ఆత్రం ప్రభు, ఆత్రం బల్లార్షా, పంద్రం జయవంత్ రావు, పంద్రం లక్ష్మణ్ నాలుగు కుటుంబాలకు చెందిన ఆరు ఇళ్లకు నిప్పంటుకొని పూర్తిగా దగ్ధం కావడంతో గిరిజన కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రమాదంలో సుమారు 50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని స్థానికులు తెలిపారు. ఘటన స్థలానికి రెవెన్యూ అధికారులు చేరుకున్నారు.

Tags:    

Similar News