తీవ్ర విషాదం.. ఇద్దరు మహిళలు బలవన్మరణం

కుమురంభీం అసిఫాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలు బలవన్మరణానికి పాల్పడ్డారు.

Update: 2024-05-04 14:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: కుమురంభీం అసిఫాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం సిర్పూ్ర్ టి.మండలం బెస్తవాడలో చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా నిన్న(శుక్రవారం) రమ అనే మహిళ సూసైడ్ చేసుకుంది. అయితే, రమ మృతికి సరిత అనే మరో మహిళ కారణమని బంధువులు ఆరోపించించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సరిత ఇవాళ బలవన్మరణానికి పాల్పడింది. స్థానికుల సమాచారంతో విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News