భారత్తో వన్డే సిరీస్కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. తిరిగి జట్టులోకి మాక్స్వెల్
భారత్తో టెస్ట్ సిరీస్ అనంతరం మూడు వన్డేల సిరీస్ జరగనుంది. దీనికి ఆస్ట్రేలియా 16 మంది ఆటగాళ్లతో ODI జట్టును ప్రకటించింది.
దిశ, వెబ్ డెస్క్: భారత్తో టెస్ట్ సిరీస్ అనంతరం మూడు వన్డేల సిరీస్ జరగనుంది. దీనికి ఆస్ట్రేలియా 16 మంది ఆటగాళ్లతో ODI జట్టును ప్రకటించింది. కాగా ఈ జట్టుకు కెప్టెన్గా పాట్ కమిన్స్ నాయకత్వం వహించనున్నాడు. అకిలెస్ గాయం కారణంగా పేసర్ జోష్ హేజిల్ వుడ్ ఈ సిరీస్ దూరం అయ్యాడు. కాగా ఈ టీమ్ లో గ్లెన్ మ్యాక్స్ వెల్, మిచెల్ మార్ష్, పేసన్ ఝై రిచర్డ్ సన్ తిరిగి పునరాగమనం చేయనున్నారు. అలాగే గాయం కారణంగా మిగిలిన రెండు టెస్టులకు దూరమైన డేవిడ్ వార్నర్ కి కూడా వన్డే జట్టులో చోటు కల్పించారు.
ఆస్ట్రేలియా వన్డే జట్టు..
పాట్ కమిన్స్ (సి), సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, కెమెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుస్చాగ్నే, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, ఝై రిచర్డ్సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోనిన్స్, వార్నర్, ఆడమ్ జంపా