ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ములాయం సింగ్..

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి యాజమాన్యం కీలక ప్రకటన చేసింది.

Update: 2022-10-03 14:52 GMT

న్యూఢిల్లీ: సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఆయన స్పెషలిస్ట్ వైద్య బృందం ఆధ్వర్యంలో చికిత్స తీసుకుంటున్నారని సోమవారం తెలిపింది. ఆసుపత్రి యాజమాన్యం ఇచ్చిన ప్రకటనను సమాజ్ వాదీ పార్టీ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. నేతాజీని చూసేందుకు ఆస్పత్రి వద్దకు ఎవరూ రావద్దని, ఆయన కలిసే అవకాశం లేదని పేర్కొంది. ములాయం ఆరోగ్య పరిస్థితిపై సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తామని తెలిపింది. క్రితం రోజే ములాయం శ్వాసకోశ సంబంధిత సమస్యలతో మేదాంత ఆస్పత్రిలో ఐసీయూకు మార్చినట్లు ఎస్పీ పేర్కొన్న సంగతి తెలిసిందే.

Similar News