ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మంత్రి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోగులకు వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. అలాగే కరోనా వార్డుల వద్ద పరిస్థితుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రాత్రి సమయంలో విధులు […]

Update: 2020-08-11 11:52 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మంత్రి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా రోగులకు వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. అలాగే కరోనా వార్డుల వద్ద పరిస్థితుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రాత్రి సమయంలో విధులు నిర్వహించే సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

Tags:    

Similar News