ముత్యంరెడ్డి హయాంలోనే దుబ్బాక అభివృద్ధి

దిశ, సిద్దిపేట : దుబ్బాక ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని గెలిపించేందుకు కృషి చేస్తామని పార్టీ బీసీ సెల్ రాష్ట్ర చైర్మన్ కత్తి వెంకటస్వామి గౌడ్ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ నాయకులు చంద్ర శేఖర చారి, శ్రీనివాస్ గౌడ్, అంజన్ కుమార్, పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కత్తి వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ.. దుబ్బాక […]

Update: 2020-10-08 07:44 GMT

దిశ, సిద్దిపేట : దుబ్బాక ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని గెలిపించేందుకు కృషి చేస్తామని పార్టీ బీసీ సెల్ రాష్ట్ర చైర్మన్ కత్తి వెంకటస్వామి గౌడ్ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ నాయకులు చంద్ర శేఖర చారి, శ్రీనివాస్ గౌడ్, అంజన్ కుమార్, పలువురు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కత్తి వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ.. దుబ్బాక ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ.. అధికార, ధనబలంతో గెలవాలని చూస్తోందని ఆరోపించారు. పేద, మధ్య తరగతి ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ముత్యం రెడ్డి హయాంలో జరిగిందని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.

Tags:    

Similar News